బాగ్ అంబర్పేట్ డివిజన్ బురుజు గల్లీలో కలుషిత మంచినీటి సరఫరా జరుగుతున్నదని స్థానికులు తెలియజేయగా వెంటనే స్పందించిన డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి, వాటర్ వర్క్స్ మేనేజర్ మాజీద్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, డ్రైనేజ్ సూపర్వైజర్ లక్ష్మణ్ లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే డ్రైనేజీ, వర్షపు నీటి కాలువ మరియు మంచినీటి పైపులైన్లకు సంబంధించిన పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే పూర్తి అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్య మరియు కలుషిత మంచినీటి సమస్య, వర్షపు నీటి కాలువకు సంబంధించిన సమస్యలు మాటిమాటికి రాకుండా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని తెలిపారు. గ్రేటర్ బిజెపి మాజీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, రంగంపల్లి రాజు, మిరియాల శ్రీనివాస్, డి.వెంకటేష్, రమేష్ ముదిరాజ్, నర్సింగ్ రావు ముదిరాజ్, పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్