హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్ తులసి రామ్ నగర్ లో (లంక) మంచి నీటి సరఫరాలో లో-ప్రెషర్ సమస్య తీవ్రంగా ఉందని బస్తీ వాసులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే లంకలో క్షేత్ర స్థాయిలో పర్యటించి బస్తీ వాసులతో మాట్లాడి లో-ప్రెషర్ సమస్యను పరిశీలించారు. జాప్యం చేయకుండా వెంటనే బస్తీలో లో-ప్రెషర్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే లంకలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బస్తీలో పలు చోట్ల వీధి దీపాలను, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, బస్తీ చివరన ప్రహరీ గోడను నిర్మించాలని, అలాగే కొంత మందికి నూతన ఆసరా పెన్షన్లు మంజూరు కాలేదని తెలుపుగా, సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట