28.7 C
Hyderabad
May 5, 2024 23: 41 PM
Slider ముఖ్యంశాలు

హైదరాబాద్ లో చెలరేగుతున్న డ్రగ్స్ మాఫియా

#Drug Mafia

లాక్ డౌన్ నిషేధాలను సడలించిన తర్వాత హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా చెలరేగి పోతున్నదా? అవుననే అనిపిస్తున్నది జరుగుతున్న పరిణామాలు చూస్తే. గతంలో డ్రగ్స్ తీసుకున్న 300 వందల మందిపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టడంతో కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

లాక్‌ డౌన్ సడలింపుతో మళ్లీ వారంతా డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిఘా పెట్టిన ఈ 300 మందిలో సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు, విద్యార్థుల పేర్లు కూడా ఉన్నాయి. కొంతమంది ప్రముఖులు బెంగుళూరుకి వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. గతంలో డ్రగ్స్ విక్రయాలు జరిపిన వారి కదలికలపై కూడా అధికారులు నిఘా ఉంచారు.

గత 15 రోజులుగా హైదరాబాద్‌లో డ్రగ్స్  కొనుగోలు, అమ్మకాలు పెరిగినట్లుగా అధికారులు గుర్తించారు. గతంలో అరెస్టు చేసిన ఇద్దరి కాల్ డేటా ఆధారంగా వీరందరిని ట్రాక్ చేసినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. దీంతో డ్రగ్స్ తీసుకుంటున్న వారి జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

గతంలో అరెస్టు అయిన ఇద్దరి వాట్సాప్ చాటింగ్‌ ను రిట్రీవ్ చేసేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పోలీస్ అధికారుల సహాయాన్ని ఎక్సైజ్ అధికారులు తీసుకుంటున్నారు. వాట్సాప్ చాటింగ్ బయటకు వస్తే మరికొంతమంది ప్రముఖుల బండారం బయటపడే అవకాశం ఉన్నది.

Related posts

అధునాతన ఫీచర్లతో ఐటీ శాఖ వెబ్సైట్

Satyam NEWS

ములుగులో ఇంగ్లీష్ భాష పై పోటీలు

Satyam NEWS

ఇందిరా గాంధీకి కొల్లాపూర్ లో ఘనంగా నివాళి

Satyam NEWS

Leave a Comment