నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
భారతదేశ తొలి మహిళ ప్రధాని దేశంలోనే ఉక్కు మహిళగా పేరు తెచ్చుకొని మహిళలకు అందరికీ ఆదర్శంగా నిలబడి దేశ రాజకీయాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప మహిళగా, బడుగు బలహీన వర్గాల, పేద ప్రజల నాయకురాలిగా, దేశంలో ఉన్న ఎంతోమంది పేదవాళ్ళకి పక్కా ఇళ్లను నిర్మించి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కల్పించి, భూమిలేని పేదవారికి భూములను పంచి, బ్యాంకులను జాతీయం చేసి భారత దేశనీ,ప్రపంచ పటంలో నెంబర్ వన్ గా నిలిపి ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయురాలు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టౌన్ ఉపాధ్యక్షులు బాబా, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి మొట్టే పరమేష్ , ఎల్లూరు గ్రామ పార్టీ అధ్యక్షులు బింగి పరశురామ్ యాదవ్, తాలూకా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మదుగం రాజేష్ యాదవ్,కాంగ్రెస్ నాయకులు శరత్ గౌడ్, మహిమూద్, వలి, తిరుపాలు, శ్రీను, పవన్,కురుమూర్తి , రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.