31.2 C
Hyderabad
February 14, 2025 20: 40 PM
Slider ప్రత్యేకం

శాపం: నన్ను పంపిస్తారా? నాశనం అయిపోతారు

pridhvi 121

ఎస్ వి బి సి చైర్మన్ గా రాజీనామా చేసిన సినీనటుడు పృథ్వి అందరికి శాపనార్థాలు పెట్టారు. తనపై కుట్ర పన్నిన వారు నాశనం అయిపోతారని ఆయన అన్నారు. తన రాజీనామా వ్యవహారాన్ని చెప్పేందుకు ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన పలు విషయాలను ఏకరవు పెట్టారు. సంక్రాంతి రోజు తమ కుటుంబం అంతా కన్నీళ్ల పర్యంతం అయ్యారని పృథ్వి వాపోయాడు.

స్వామి మీద ఒట్టు వేసి చెబుతున్నా…నా మీద ఆరోపణలు చేసిన వారు భ్రష్ఠు పట్టిపోతారని కూడా అన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు చేస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. అందరి దేవుళ్ళ మీద ఒట్టు వేసి చెబుతున్నా అని పృథ్వి అన్నాడు. విజయవాడకు చెందిన ఒక జర్నలిస్ట్ నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆయనకు అమరావతిలో 9 ఎకరాల భూమి ఉంది అని పృథ్వి అన్నాడు. తాను ఏ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయలేదని, ఒరిజినల్ రైతులకు క్షమాపణ చెబుతున్నాని పృథ్వి అన్నాడు.

Related posts

గుంత‌ల‌ రోడ్లు బాగు చేయాల‌ని బీజేపీ ధ‌ర్నా

Sub Editor

ఏసిబి నివేదికతో దుర్గగుడి ఈవో సురేష్ పై వేటు?

Satyam NEWS

సో శాడ్: ఎన్నికల పిచ్చితో అల్లాడుతున్నాడు

Satyam NEWS

Leave a Comment