వనపర్తి పోలీసులు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. మారు మూల ప్రాంతాల నుంచి కూడా బాధితులు వచ్చి పోలీసులకు తమ సమస్యలు విన్నవిస్తున్నారు.
సోమవారం వనపర్తి జిల్లా పోలీసు ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 10 మంది ఫిర్యాదు దారులు వచ్చారు.
ఫిర్యాదు దారులతో వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
నేడు అందిన ఫిర్యాదులలో భూ తగాదాలకు సంబంధించినవి రెండు ఫిర్యాదులు ఉండగా భార్యాభర్తల ఫిర్యాదులు మూడు ఉన్నాయి.
అదే విధంగా పరస్పర గొడవల ఫిర్యాదులు ఐదు వరకూ ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరిస్తామని ఎస్పీ అపూర్వరావు హామీ ఇచ్చారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి