ఎక్సయిజ్ పోలీసులు ఎంత ప్రయత్నించినా గంజాయి స్మగ్లింగ్ ఆగడం లేదు. ఆంధ్రా సరిహద్దుల నుంచి గంజాయి దిగుమతి అవుతూనే ఉంది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎక్సయిజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించగా 900 గ్రాముల డ్రై గంజాయి దొరికింది. శుక్రవారం ఉదయం కొల్లాపూర్ మండల పరిధిలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండల పరిధిలోని ఎల్లూరు గ్రామ సమీపంలో కే ఎల్ఐ పంప్ హౌస్ దగ్గర డ్రై గంజాయ్ పట్టుబడింది. 900 గ్రాముల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్ చేసినట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తెలియజేశారు. ఈ దాడులలో ఎక్సయిజ్ శాఖకు చెందిన సిఐ ఏడుకొండలుతో బాటు రజా, మహేష్ తదితరులు ఉన్నారు.