కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కి మళ్లీ టిక్కెట్ ఇవ్వాలంటే జగన్ రెడ్డి ఒక కండిషన్ పెట్టారు. అదేమిటంటే తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబునాయుడిని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బండబూతులు తిడితేనే సీటు ఇస్తామని చెప్పారట. ఈ కండిషన్ చెప్పడానికి నాయకులు ఎవరు సాహసించలేదు. దాంతో జగన్ రెడ్డి ఐప్యాక్ టీమ్ సభ్యులను మహీధర్ రెడ్డి దగ్గరకు పంపారు. తన వద్దకు వచ్చిన ఐప్యాక్ టీమ్ సభ్యులతో కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. జగన్ పంపిన ఐప్యాక్ సభ్యులు, వైసీపీ నేతలపై మహిధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రతిపక్ష నేతలను తిట్టడం ద్వారా వచ్చే సీటు అవసరం లేదని మహిధర్ రెడ్డి స్పష్టం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా రెండు రోజుల క్రితం మహిధర్ రెడ్డికి ఇదే సందేశం పంపారు. మహిధర్ రెడ్డి స్పందించక పోవడంతో నిన్న మరోసారి మహిధర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఐప్యాక్ టీం సభ్యులు చెప్పారు. దాంతో జగన్ తీరుపై ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిధర్ రెడ్డి సీరియస్ కావడంతో విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. దాంతో ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇక లాభం లేదనుకుని మహిధర్ రెడ్డిని కలిసేందుకు విజయసాయిరెడ్డి బయలుదేరారు.
previous post