38.2 C
Hyderabad
May 5, 2024 22: 44 PM
Slider ముఖ్యంశాలు

చైనాకు మద్దతు తెలిపే కమ్యూనిస్టులను అరెస్టు చేయాలి

#Vishwa Hindu Parishad

చైనాలో వర్షం పడితే భారత్ గొడుగు పట్టే చైనా భక్తులను దేశం నుంచి వెలి వేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. దేశ సంపదను అనుభవిస్తూ మన శత్రువు దేశమైన చైనా కు మద్దతుగా మాట్లాడుతున్న కమ్యూనిస్టులను దేశ ద్రోహులుగా గుర్తిస్తూ అరెస్టు చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.

శత్రుదేశం మేలు కోరుతూ స్వదేశం నాశనం కోరుతున్న కమ్యూనిస్టులను దేశ ప్రజలు సత్కరిస్తున్న బుద్ధి రావడం లేదని విశ్వహిందూ పరిషత్ విమర్శించింది. చైనా వస్తువులను మనదేశంలో నిషేధించాలని చాలామంది కోరుతుంటే కమ్యూనిస్టులు మాత్రం చైనాకు మద్దతు పలకడం సిగ్గుచేటని విశ్వ హిందూ పరిషత్ విమర్శించింది. బాబా రాందేవ్ వస్తువులను నిషేధించాలని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ డిమాండ్ చేయడం సిగ్గుచేటని విశ్వహిందూ పరిషత్ వ్యాఖ్యానించింది.

కరోనా వైరస్ కు మందు కనిపెట్టిన రాందేవ్ బాబా ను హర్షించాల్సిందిపోయి విమర్శించడం  సిగ్గు చేటని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్, వి హెచ్ పి ప్రచారక్ సహ ప్రముఖ పగడ కుల బాలస్వామి అన్నారు.

ఇప్పటికే భారత చట్టసభల్లో ఉనికి కోల్పోయిన కమ్యూనిస్టులు ఎర్ర జెండాలతో రోడ్లపైకి వచ్చి జాతి ద్రోహ కార్యకలాపాలకు పాల్పడటం చట్టరీత్యా నేరంగా భావించాలని వారు డిమాండ్ చేశారు. అలాంటి వారిని తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Related posts

తొలి చార్జిషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేదు

Satyam NEWS

మిగిలిన డిగ్రీ సీట్లు

Murali Krishna

నిస్వార్ధంగా పని చేస్తే  చిర స్థాయిగా నిలిచిపోతారు

Satyam NEWS

1 comment

తంగిరాల సూర్య ప్రకాశ రావు June 26, 2020 at 5:33 PM

నాణ్యత కరువైన రాజన్న లడ్డు

శివాలయాల్లో ప్రసాదాల పంపిణీ మన సంప్ర
దాయం కాదు.

గత 20 సంవత్సరాలుగ దేవాదాయ శాఖ
ధనాదాయ శాఖగ మారి వెర్రి వేషాలు
వేస్తోంది.

సంప్రదాయం తెలిసిన పండితులు చెప్పరు.
చెప్పినా అధికారులు వినరు.

సగటు హిందువుకు ప్రభుత్వం ఏం చేస్తే
అదే సరైనది అనుకుంటారు

Reply

Leave a Comment