28.7 C
Hyderabad
May 6, 2024 01: 44 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి రూరల్ పోలీస్టేషన్ ను  తనిఖీ చేసిన వనపర్తి  డిఎస్పీ

#wanaparthypolice

వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు  వనపర్తి డిఎస్పీ  ఆనంద్ రెడ్డి వనపర్తి రూరల్ పోలీస్టేషన్ ను  సందర్శించి స్టేషన్లో  రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేసి పోలీస్టేషన్ ఆవరణంలో ఆవరణలో మొక్కలు నాటారు. అందులో భాగంగా పోలీస్టేషన్ పరిధిలో   నమోదు అవుతున్న గ్రేవ్  కేసుల వివరాలను, పోలీస్టేషన్ పరిధిలోని లా అండ్ ఆర్డర్ నిర్వహణ ఎలా అమలవుతుంది, గత సంవత్సరంలో  పోలీస్టేషన్ లో  ఎన్ని కేసులు నమోదు అయ్యావి,  ఎన్ని కేసులలో నిందితులకు శిక్షలు పడ్డవి, పోలిస్టేషన్  పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఏ ఏ ప్రాంతాలలో నేరాలు, రోడ్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వివరాలు, నేరస్థుల ప్రస్తుత పరిస్థితులు ఏవిధంగా ఉన్నవి తదితర వివరాలను  ఎస్సైని  అడిగి తెలుసుకున్నారు.

అలాగే   పోలీస్టేషన్ లోని 5S అమలు తీరును, గ్రేవ్ కేసులకు సంబంధించి  Cctns ప్రాజెక్ట్ ఆన్ లైన్ లో పిటిషన్ మేనేజ్మెంట్లో ఎంట్రీ చేసిన డాటాను, మరియు పిటిషన్ ఫైల్ లో ఉన్న ఎంక్వేరి రిపోర్ట్ ను పరిశీలించారు.

పోలీస్టేషన్ పరిధిలోని  పోలీస్టేషన్ లో నమోదయిన గ్రేవ్ కేసుల సి. డి ఫైల్స్ ను, క్రైమ్ మెమోస్, క్రైమ్ డైజెస్ట్ రికార్డ్ లను, పి. టి    కేస్ ఫైల్స్ ను, యు.ఐ కేసుల ఫైల్స్ ను  పరిశీలించారు.  పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని ప్రతి సిడి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని , గ్రేవ్ కేసులలో యు.ఐని తగ్గించాలని ఎస్సై గారిని   ఆదేశించారు. గ్రేవ్ కేసుల విషయంలో  సిసిటిఎన్ఎస్ ప్రాజెక్టులో నమోదు చేస్తున్న ఎఫ్ఐఆర్, సిడిఆర్, పార్ట్ వన్, పార్ట్ టు, డిమాండ్ డైరీ, చార్జిషీట్, ఇంటరాగేషన్ రిపోర్ట్స్ ను ఆన్ లైన్లో ఎంట్రీ అవుతున్న తీరును  పరిశీలించారు.

పోలీస్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో  డయల్ 100 కాల్ రాగానే వెంటనే ఆయా పోలీస్ స్టేషన్ ల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను  పరిష్కరిoచేటట్లు చూడాలని, అలాగే బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ  నిర్వహించేటట్లు ఆయా  సిబ్బంది ద్వారా  చర్యలు చేపట్టాలని ఎస్సైకి  సూచించారు. తరచుగా పోలీస్టేషన్  పరిధిలోని చేయాలని, సిబ్బంది పనితీరును, 5ఎస్ అమలు తీరు, ఫంక్షనల్ వర్టీకల్ నిర్వహణను పర్యవేక్షించాలి అని, సర్కిల్ పరిధిలోని ఎస్సై లతో నమోదు అవుతున్న, అయిన కేసులపై రివ్యూ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. 

కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా సిసి కెమెరాల స్థాపనకు ప్రజలను ప్రోత్సహించాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని డిఎస్పీ  సూచించారు. జాతీయ  రహదారులు, రాష్ట్ర రహదారుల పై రోజు రాత్రి వేళల్లో ఎస్.హెచ్.ఓ.లు  తమ పరిధిలో తనిఖీలు చేపట్టి ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్, మద్యం త్రాగి డ్రైవింగ్ చెసే వాహనాలను, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చెసే వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.  పోలీస్టేషన్ పరిధిలో  ఆయా గ్రామాల్లో సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్సైకి సూచించారు. సిబ్బందితో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటె తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి  సిఐ  ప్రవీణ్ కుమార్, వనపర్తి రూరల్ ఎస్సై చంద్ర మోహన్, రెండవ ఎస్సై, రామరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

వైసీపీ ఎంపి రఘు రామకృష్ణ రాజు హత్యకు కుట్ర ?

Satyam NEWS

ఒకే కుటుంబంలో నలుగురిని పొట్టన పెట్టుకున్న కరోనా

Satyam NEWS

Thank God: కులం రంగు పులిమే అవకాశం రాలేదు

Satyam NEWS

Leave a Comment