ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరానికి చెందిన మాజేటి రామ సుబ్బారావు నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంకు దుర్గాదేవి పంచలోహ విగ్రహాన్ని విరాళంగా అందించారు.
శ్రీ సింహ వాహిని చండి పరా దేవి ( దుర్గాదేవి) పంచ లోహ విగ్రహం 113 కిలోల 600 గ్రాముల బరువు ఉంది. ఈ విగ్రహం విలువ ఒక లక్షా డెబ్భై వేల రూపాయలు ఉంటుంది.
ఈ విగ్రహాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని చండి యాగశాలలో ఆలయ ప్రధానార్చకులు సంజీవ్ పూజారి, ఆలయ వేద పండితులు, ఆలయ పూజారులు ప్రత్యేక పూజా చేసి ( చర ప్రతిష్ట) ప్రతిష్టి నిర్వహించారు.