33.7 C
Hyderabad
April 29, 2024 00: 56 AM
Slider హైదరాబాద్

సుభాష్ చంద్రబోస్ కాలనీలో బస్తీ బాట కార్యక్రమం

#BastiBata

హైదరాబాద్ ఆల్విన్ కాలనీ డివిజన్ సుభాష్ చంద్రబోస్ కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానికులు కాలనీలో రోడ్డు పనులు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పటికే కాలనీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయినప్పటికీ చిన్నచిన్న సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు ఒత్తిడితో రావడం లేదని నీరు సరిపోక బోరు లేని వారు అవస్థలు పడుతున్నారని ఆయనకు వివరించారు.

 దీనికి స్పందించిన కార్పోరేటర్ జలమండలి అధికారులతో మాట్లాడి నీటి సరఫరా సజావుగా జరిగేలా చూస్తానని రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మీ బస్తీకి పెద్ద కొడుకులా ఉంటా అని అన్నారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకులు రామకృష్ణ గౌడ్ ,డివిజన్ అధ్యక్షుడు గణేష్, మాజీ అధ్యక్షుడు పాండు గౌడ్, వార్డు సభ్యులు కాశీనాథ్ యాదవ్, నాయకులు బోయ కిషన్, రాములు గౌడ్B, వాసు,

కురుమయ్య, వెంకట్ నాయక్, మహేష్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఎస్ కె బి బి, సరూప రెడ్డి, అమృత, లలిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంటరాగేషన్: తట్టుకోలేక ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

కరోనా వాక్సిన్ విషయంలో మానవ కోణం అవసరం

Satyam NEWS

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో బతుకమ్మ సంబురాలు

Satyam NEWS

Leave a Comment