ద్వాదశ జ్యోతిర్లింగ మహా పడి పూజ కొందుర్గు మండల పరిధిలోని తంగాళ్లపల్లి గ్రామంలో ఘనంగా జరిగింది. వడ్ల నారాయణ స్వామి గృహంలో కమ్మరి భూపాల చారి గురు స్వామి ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా ఈ మహాపడిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గురు స్వాములు యాదయ్య యాదవ రెడ్డి, నర్సింలు, సత్తెయ్య, రామకృష్ణ, ప్రతాప్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి శివ స్వాములు పాల్గొన్నారు. పూజ అనంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. అదే విధంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది.