కడప జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. వి.ఎన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మద్ది-బుసిరెడ్డి పల్లి రహదారి వై జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించగా రేషన్ బియ్యం పట్టుబడింది. రెండు వాహనాల్లో ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా ముగ్గురు వ్యక్తులు తరలిస్తున్నారు. 55 బ్యాగుల్లో తరలిస్తున్న 2.7 టన్నుల (2717 కిలోల) రేషన్ బియ్యం, టాటా వింగర్, టాటా ఏస్ వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వి.ఎన్ పల్లి ఎస్.ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
previous post