స్వాతంత్ర్య సమర యోధుడు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గీత పనివారల సంఘం వ్యవస్థాపకుడు అమరజీవి కామ్రేడ్ ధర్మ భిక్షం ఆశయాలను సాధిద్దామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 11వ,వర్ధంతిని నిర్వహించారు.ముందుగా ధర్మబిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకురి బాబు మాట్లాడుతూ ధర్మభిక్షం తన జీవితాంతం పేద ప్రజల,గీతనేత, మత్యవృత్తుల వారికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.ఆయా సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి నిరంతరం కృషి చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్లావుల రాములు,రమేష్,కంబాల శ్రీనివాస్, గుండు వేంకటేశ్వర్లు,జడ శ్రీనివాస్, కుడితొట్టి స్వామి,మోహన్ రావు,చెన్నా లింగయ్య,వీరారెడ్డి,శ్రీనివాస్,మామిడి నర్సయ్య,చక్రాల నాగరాజు, వీరబాబు, పేరూరి అశోక్,బంటు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్