టీఆర్ఎస్ నేత గడి మధుసూధన్రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రేణ అగ్రి నేచర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో ఎకో ప్రెండ్లీ సీడ్ గణేష్ కిట్టు ను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చదనం పరిరక్షణలో భాగంగా సీడ్ గణేష్ కిట్టును వాడి నవరాత్రుల పూజ అనంతరం నిమజ్జనం చేసినట్లయితే తిరిగి మొక్కలుగా పెరిగి పర్యావరణానికి హాని కలుగకుండా ఉంటుందని పేర్కొన్నారు.
ఎకోప్రెడ్లీ విగ్రహాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. అనంతరం ప్రేరణ అగ్రి నేచర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు ప్రేమ్ సతీష్, నాగరాజులను ఎమ్మేల్యే అభినందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేష్రెడ్డి, శ్రీధర్రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.