ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నేడు తన పీఏను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం ట్వీట్ చేశారు. ఈరోజు నా పీఏ ఇంటిపై ఈడీ దాడులు చేసింది, అయితే అక్కడ ఏమీ కనిపించలేదు. అయినా అతడిని అరెస్టు చేశారు అని సిసోడియా ట్విట్టర్లో తెలిపారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పీఏను అదుపులోకి తీసుకుని వాంగ్మూలాలు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. మనీష్ సిసోడియా ట్విట్టర్లో ‘వారు నా ఇంటిపై తప్పుడు ఎఫ్ఐఆర్ తో దాడి చేశారు, బ్యాంక్ లాకర్లను శోధించారు, మా గ్రామంలో దర్యాప్తు చేశారు, కానీ నాకు వ్యతిరేకంగా ఏమీ దొరకలేదు. ఈ రోజు వారు నా PA ఇంటిపై ED దాడి చేసారు. అక్కడ ఏమీ దొరకలేదు అని పేర్కొన్నారు. బీజేపీ వాళ్ళకి ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టిపీడిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.
previous post
next post