టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభలకు పూర్తి సహకారం అందిస్తానని హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభలకు హాజరు కావాలని శుక్రవారం ఆహ్వానించారు.ఈ సందర్భంగ సైదిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా నాగేశ్వరరావు, నూకల నరేందర్ రెడ్డి,పిల్లలమర్రి శ్రీనివాసు, టి.వి.ఎల్,కితా రామనాథం,దేనముకొండ శేషం రాజు,సోమగాని రాంప్రసాద్,పెందుర్తి భాస్కర్,షేక్ జానీ పాషా,దేవరం రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి,కోమరాజు అంజయ్య,ఇట్టిమల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్