అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగియడంతో అందరి దృష్టీ లోక్ సభ ఎన్నికలపై పడింది. వచ్చే వారంలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా 9వ తేదీతో సమావేశాలు ముగుస్తాయి. తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చు.
previous post