అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ గత నెల 9న షెడ్యూలు ప్రకటించడంతో దానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఈ నెల 3 న నోటిఫికేషన్ను జారీ చేయనున్నది.నోటిఫికేషన్ వెలువడడంతోనే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లను దాఖలు చేసుకోడానికి కమిషన్ గడువు ఇచ్చింది. నామినేషన్లను ఈ నెల 13వ తేదీ వరకు పరిశీలించి, అర్హత కలిగిన దరఖాస్తుల విషయమై ప్రకటన చేయనున్నది. నిబంధనల మేరకు సక్రమంగా ఉన్న నామినేషన్ల విషయంలో అభ్యర్థులు ఉపసంహరించుకోడానికి ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉన్నది. ఆ ప్రక్రియ ముగియగానే ఏ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది తేలిపోతుంది.
next post