38.2 C
Hyderabad
April 28, 2024 21: 28 PM
Slider ముఖ్యంశాలు

సంగం డైరీ కేసులో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

#APHighCourt

రాష్ట్ర ప్రభుత్వం సంగం డైరీని తన అధీనంలోకి తీసుకుని తెనాలి ఆర్డిఓ అజమాయిషీలో నిర్వహించేందుకు వీలుగా 27-04-2021 న జారీ చేసిన జిఓ నం. 19 చెల్లనేరదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు తీర్పునిచ్చింది.

గతంలోనే జస్టిస్ DVSS సోమయాజులు జీవో అమలుపై స్టే మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం స్టే మంజూరును ఛాలెంజ్ చేస్తూ చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రోజు హైకోర్టు తీర్పును వెలువరించింది.

ఎలాగైనా సంగం డైరీని హస్తగతం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు  చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. తాజా హైకోర్టు తీర్పుతో  రాష్ట్ర ప్రభుత్వ ఏమి చేస్తుందో వేచిచూడాలి.

Related posts

కరోనా ఎలర్ట్: వ్యాధి నిరోధక ఆహారం తీసుకోవాలి

Satyam NEWS

ఖమ్మం బహిరంగ సభకు భారీగా తరలిన టిడిపి శ్రేణులు

Satyam NEWS

ఆర్థిక పరిస్థితి బాలేనపుడు అదనంగా సలహాదారులెందుకు?

Satyam NEWS

Leave a Comment