మహిళల సాధికారిత సిఎం కెసిఆర్ లక్ష్యమని ఎంపిపి గూడెపు శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎం పి డీ ఈ ఓ శాంతా కుమారి,ఏపిఓ శైలజా,సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ,కంప్యూటర్ ఆపరేటర్ సాయిలక్ష్మి, టిఎ అరుణ లతో పాటు కార్యాలయ సబార్డినేట్స్ సునీత, జ్యోతి లను శాలువా,పూల మాలలతో సన్మానించారు.
ఈ సందర్భంగా గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ వేడుకలను మూడు రోజులు జరుపుకోవడం అభినందనీయమని అన్నారు.మహిళలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందినప్పుడే నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్