38.2 C
Hyderabad
May 1, 2024 20: 20 PM
Slider నల్గొండ

మహిళల సాధికారతే సిఎం కెసిఆర్ లక్ష్యం

#women'sday

మహిళల సాధికారిత సిఎం కెసిఆర్ లక్ష్యమని ఎంపిపి గూడెపు శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎం పి డీ ఈ ఓ శాంతా కుమారి,ఏపిఓ శైలజా,సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ,కంప్యూటర్ ఆపరేటర్ సాయిలక్ష్మి, టిఎ అరుణ లతో పాటు కార్యాలయ సబార్డినేట్స్ సునీత, జ్యోతి లను శాలువా,పూల మాలలతో సన్మానించారు.

ఈ సందర్భంగా గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ వేడుకలను మూడు రోజులు జరుపుకోవడం అభినందనీయమని  అన్నారు.మహిళలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందినప్పుడే నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సింహపురి ఎక్స్ప్రెస్ వేళను గంటపాటు తగ్గించండి

Bhavani

వైభవంగా వైమానిక దళ దినోత్సవం

Satyam NEWS

చిన్న పిల్లలు మోటారు వాహనాలు నడిపితే కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment