కరోనా లాక్ డౌన్ సందర్భంగా రోజూ వారీ పనులు లేక అల్లాడుతున్న వారికి దాతలు నిత్యావసరాలు పంచిపెట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని కమల నెహ్రూ కాలనీ లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ పాల్గొన్నారు. ఇంకా డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంతన్, జిల్లా కమిటీ సభ్యులు రాష్ట్ర బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 35 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఈ కార్యక్రమంలో పంచిపెట్టారు.