అక్షయ తృతీయ పర్వదిన సందర్భంగా అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మల్లాపూర్ లో 120 మందికి పేద వైశ్య బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సియండి సీల్ వెల్ కార్పొరేషన్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారు, బ్యాంక్మెన్ చాప్టర్, కుటీర్ శ్రేయోభిలాషులు వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండారు సుబ్బారావు పాల్గొన్నారు. ఒక్కొక్కరికి రూ.1500ల విలువ గల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా పసుమర్తి మల్లికార్జున్ వామ్ గ్లోబల్ కార్యదర్శి, యల్ వి కుమార్ వామ్ గ్లోబల్ కోశాధికారి, అద్యక్షులు యల్ వి సేవావేదిక వచ్చి వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ హైదరాబాద్ మరియు కుటీర్ అద్యక్షులు పివి రమణయ్య, కేవియస్ గుప్తా కుటీర్ కార్యదర్శి మరియు కోశాధికారి అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ హైదరాబాద్ రామకృష్ణ హండే, యస్ ప్రభాకర్ కుటీర్ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ ఇటువంటి చక్కని కార్యక్రమానికి సంపూర్ణ ఆర్థిక సహకారం అందజేసిన బండారు సుబ్బారావు దాతృత్వ గుణాలను కొనియాడారు. ముఖ్య అతిథులకు హాజరైన సభ్యులకు గ్రహీతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.