42.2 C
Hyderabad
April 30, 2024 17: 45 PM
Slider మహబూబ్ నగర్

పేదలకు నిత్యావసరాలు పంచిన మహేంద్ర సంఘం

Mehendra youth

కరోనా విస్తృతి కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి కొల్లాపూర్ మహేంద్ర యువజన సంఘం ముందుకు వచ్చింది. కొల్లాపూర్ పట్టణ సమీపంలో ఉన్న ఎల్లూరు గ్రామ పంచాయతీ లో భాగమైన  చెంచుగూడెం ప్రజలకు మహేంద్ర యువజన సంఘం ప్రతినిధులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

 సివిల్ ఇంజనీర్ కోన వెంకట స్వామి ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేశారు. మొత్తం 30 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, కిరాణం సామాను పంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహేంద్ర యువజన సంఘం సభ్యులు పిన్నంశెట్టి శివకుమార్,  కోన నరేష్ , పులి శ్రీను, జోర్రిగల రాజశేఖర్, పిన్నం శెట్టి వెంకట్ రాములు, పులి భరత్, ప్యారసాని ఉమేష్, పులి భాస్కర్, కోన బాలకృష్ణ, పిన్నంశెట్టి ప్రశాంత్ , కోన శ్రీకాంత్, ప్యరసాని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తిలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నిర్మాణాన్ని ఆపాలని ధర్నా

Bhavani

ద్రౌపది గా వస్తున్న దీపికా పదుకొనే

Satyam NEWS

హింస ద్వేషం ప్రేరేపిస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు

Satyam NEWS

Leave a Comment