కరోనా విస్తృతి కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి కొల్లాపూర్ మహేంద్ర యువజన సంఘం ముందుకు వచ్చింది. కొల్లాపూర్ పట్టణ సమీపంలో ఉన్న ఎల్లూరు గ్రామ పంచాయతీ లో భాగమైన చెంచుగూడెం ప్రజలకు మహేంద్ర యువజన సంఘం ప్రతినిధులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
సివిల్ ఇంజనీర్ కోన వెంకట స్వామి ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేశారు. మొత్తం 30 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, కిరాణం సామాను పంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహేంద్ర యువజన సంఘం సభ్యులు పిన్నంశెట్టి శివకుమార్, కోన నరేష్ , పులి శ్రీను, జోర్రిగల రాజశేఖర్, పిన్నం శెట్టి వెంకట్ రాములు, పులి భరత్, ప్యారసాని ఉమేష్, పులి భాస్కర్, కోన బాలకృష్ణ, పిన్నంశెట్టి ప్రశాంత్ , కోన శ్రీకాంత్, ప్యరసాని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.