28.7 C
Hyderabad
April 27, 2024 05: 34 AM
Slider హైదరాబాద్

పోలీసులకు ప్రత్యేక మినరల్ వాటర్ సరఫరా

Ramulu TTD

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రింబగళ్లూ పని చేస్తున్న పోలీసులకు రోగ నిరోధక శక్తి పెంపొందే విధంగా ఔషధ గుణాలు కలిగిన తులసి, హల్దీ కలిపిన మినరల్ వాటర్ ను పంచారు. టిటిడి బోర్డు సభ్యుడు మురము శెట్టి రాములు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఐ ఎం సి కంపెనీ వారి శ్రీతులసి, శ్రీ హల్ది స్వచ్ఛమైన మినరల్ వాటర్ లో కలిపి రోడ్డు పై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వీరు అందచేశారు. రక్షక భటులు దాదాపు 12 గంటలు గంటలు ఎండలో నిలబడి ఉంటారు కాబట్టి వారికి ఇమ్యూనిటీ పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక మినరల్ వాటర్ పంచినట్లు వారు తెలిపారు. పోలీసులతో బాటు పారిశుద్ధ్య కార్మికులకు, రెవెన్యూ, విద్యుత్ శాఖ సిబ్బంది, జర్నలిస్టులకు కూడా ఈ ప్రత్యేక మినరల్ వాటర్ పంచి పెట్టాలని నిర్ణయించామని వారు తెలిపారు.

Related posts

టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్‌ టికెట్లకు మంచి స్పందన

Satyam NEWS

Story repeat: నారా లోకేష్ పై ఆకివీడు పోలీసుల కేసు

Satyam NEWS

BREAKING NEWS: తెలంగాణలో టపాకాయలపై నిషేధం

Satyam NEWS

Leave a Comment