కడప జిల్లా రాజంపేట మండలం బసినాయుడు గారి పల్లె దళిత వాడల్లో బుధవారం పేదవారికి జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర శాఖ అభిమానులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. రాష్ట్ర జునియర్ ఎన్టీఆర్ యువత అధ్యక్షుడు శ్రీహరి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ లో నిత్యావసర వస్తువులు ఉంచి వాటిని దళిత వాడలోని ఇంటి, ఇంటికి తిరుగుతూ పంపిణీ చేశారు. గత వారం రోజులు గా పేదలకు నిత్యావసర వస్తువులు, ఆహారం అందజేసినట్టు వారు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు తాము ముందుటామని వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుకుమార్ చౌదరి, వంశీ, శ్రీకాంత్, తేజ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.