కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం లో విషాద ఘటన చోటు చేసుకుంది. చింతల మదర జలపాతం అందాలను చూడడానికి మహారాష్ట్రలోని దేవాడ కు రామ్ కిషన్ బిజ్జు లోబడే (23 )తన మిత్రులతో కలిసి వచ్చాడు.
చింతల మధుర జలపాతం లో ఫోటో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. సమాచారం మేరకు తిర్యాణి ఎస్సై రామారావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక గిరిజన యువకులతో జలపాతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపివేసి తిరిగి రేపు ఉదయం గజ ఈతగాళ్లు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినున్నట్లు తెలిపారు