38.2 C
Hyderabad
May 2, 2024 20: 57 PM
Slider కృష్ణ

ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

Yalamancali

మానవతా దృక్పధంతో స్వచ్చంద సంస్థలు, ట్రస్ట్ లు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ రోజు కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతి 3 వార్డు లో  తెలుగుదేశం పార్టీ నాయకులు యం జి రవి, అజ్మతుల్లా ఆధ్వర్యంలో  యం జి శోభ పర్యవేక్షణలో 570 కుటుంబాలకు ఇంటింటికి కోడిగుడ్లు, ఉల్లిపాయలు పంపిణి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రకటించి నెల రోజులు కావస్తుందని, ఉపాధి లేక పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల ఆర్థిక పరిస్థితి దయానీయంగా మారిందని అన్నారు. అందుకోసం మానవతా దృక్పథంతో స్వచ్చంద సంస్థలు, ట్రస్ట్ లు ముందుకొచ్చి ఆదుకోవాలని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

అలాగే 3 వార్డులో కోడిగుడ్లు, ఉల్లిపాయలు పంపిణి చేస్తున్న రవి, బాబూ, గఫుర్, సురేష్ ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాధరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ ఖుద్దూస్, తెలుగుదేశం పార్టీ నాయకులు చేదుర్తిపాటి  ప్రవీణ్, జంపన వీర శ్రీనివాస్, 3వార్డ్ ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

ఏపి డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Satyam NEWS

క్లియర్: బీజేపీ అమరావతికి అండగా ఉంటుంది

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో టెలిఫోన్ జే ఈ మృతి

Satyam NEWS

Leave a Comment