బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మాజీ పార్లమెంటు సభ్యులు వి. హనుమంతరావు ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈటల చేసిన ఆరోపణలు ఖండిస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో మాట్లాడుతూ… ఈటేల బీజేపి చేసిన తప్పును కప్పి పుచ్చే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు.
ప్రజా సమస్యలను వదిలేసి కాంగ్రెస్ పై నిరాదరా అరోపణపలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజెపి ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికార పార్టీలో ఉన్న రాజేందర్ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పై ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఏ అధికారం లేకపోయినా సీఎం కేసీఆర్ పై కేసులు పెట్టిన దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. అలాంటి వ్యక్తి పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడాలని సవాల్ విసిరారు.