కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది.
కాగజ్ నగర్ పట్టణంలోని కిమ్స్ ఆసుపత్రిలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 32 మందిని పరీక్షించగా అందులో 20 మందికి ఆపరేషన్ అవసరమని వైద్యులు వెల్లడించారు.
ఆపరేషన్ అవసరమైన వారికి విడతల వారిగా ఆపరేషన్ నిర్వహిస్తామని, అలాగే ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.
కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా.కొత్తపల్లి అనిత తెలిపారు.
ఈ శనివారం ఆపరేషన్ నిర్వహించేందుకు బెల్లంపల్లి కంటి హాస్పిటల్ కి 20 మందిని పంపిస్తున్నామని ఆమె తెలిపారు.