37.2 C
Hyderabad
May 2, 2024 12: 24 PM
Slider హైదరాబాద్

ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి

#helthcamp

బాగ్ అంబర్ పేట్ డివిజన్ ఉస్మానియా యూనివర్సిటీ చౌరస్తా దగ్గర ఉన్న కలిగా ఆర్థోపాడిక్, మల్టీ స్పెషలిటీ సెంటర్ లో హిమగిరిగౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ రమాకాంత్ రావు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మవెంకట్ రెడ్డిలు ప్రారంభించారు.

ఈ సందర్బంగా డాక్టర్ ఎన్.గౌతమ్ రావు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన హిమిగిరి గౌడ్, వారి బృందం సభ్యులు పేదలకు ఉచిత వైద్య  శిబిరాన్ని అందించడాన్ని అభినందించారు.  కార్పొరేటర్ పద్మవెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్తితులలో ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలను చేయించుకుంటూ డాక్టర్ల సలహా మేరకు యోగ, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాని పరిరక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వనం రమేష్, చుక్క జగన్, శ్యామ్ రాజ్, జమ్మిచట్టి బాలరాజు, గోవర్ధన్ రెడ్డి, జి.మల్లేష్, మిర్యాల శ్రీనివాస్, శ్రీహరి, ఆంజనేయులు, ఉచిత శిబిర బృందం సభ్యులు పండు, సుమన్, సంతోష్ పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

స్థానిక సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర

Satyam NEWS

వికీపీడియాను మార్చేసిన చంద్రబాబునాయుడు

Satyam NEWS

పోలీసులనే బ్లాక్ మెయిల్ చేసిన దంపతులు

Satyam NEWS

Leave a Comment