సీ ఎం కేసీఆర్ మహిళా అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని, కెసిఆర్ నాయకత్వం దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.
గురువారం రామంతపూర్ మాజీ కార్పొరేటర్ గంథం జొత్స్నా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ గొల్లూరు అంజయ్య పాల్గొని జిహెచ్ఎంసి పారిశుద్ద్య కార్మికులకు చీరల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ కేసీఆర్ మహిళా అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని కెసిఆర్ నాయకత్వం దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో మహిళలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ మంత్రి కేటీఆర్, కేసీఆర్ మహిళ బంధు సంబరాలను మూడు రోజులు పాటు జరపాలని పిలుపునివ్వడంతో అనేక రూపాల్లో మహిళదినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.
ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజన్న ,హనుమంత్ రెడ్డి,టిఅర్ఎస్ నాయకులు మధుసూదన్ రెడ్డి ,ఇంద్రసేనా రెడ్డి ,సంపత్ రావు ,ఉపేందర్ ,సంద్య ,జానకి ,రాధ ,మంజుల ,లక్శ్మి ,చాప లక్శ్మి ,అరవింద్ నగర్ లక్శ్మి ,శ్రీనివాస్ రెడ్డి ,జగదీష్ కుమార్ ,కొప్పు నర్సింగ్ రావు ,అలె రమేష్ ,మనీష్ ,ప్రాసాద్ ,తుట్ నరసింహ ,నందు ,రవి ,రామచంద్ర చారి,అధిక సంఖ్యలొ జిహెచ్ఎంసీ మహిళా పారిశుద్ద కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి