పార్టీ విలీనంపై సెప్టెంబరు 30 లోపు నిర్ణయం తీసుకుంటామని వైతెపా అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. విలీనం చేయకపోతే సొంతంగా బరిలోకి దిగుతామన్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని కార్యాలయంలో షర్మిల అధ్యక్షతన పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
మొత్తం 33 జిల్లాల నుంచి పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. అక్టోబరు రెండోవారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు షర్మిల వెల్లడించారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు..