సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరో 44 మందికి నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకున్న ఈ కేసులో ఇప్పటికే 49 మందికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ 49 మంది కాకుండా మరో 44 మందికి నేడు నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాలలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై వైసీపీకి చెందిన వారు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులపై అత్యంత హేయమైన, అభ్యంతరకరమైన పోస్టులను వీరంతా చేసినట్లు ఉన్నత న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు మరి కొన్ని కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
previous post