విజయనగరం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గినప్పటికీ, ఏమాత్రం అలసత్వం ఉండకూడదని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ అన్నారు. ఇప్పటికే ప్రపంచంలో కొన్న దేశాల్లోను, ఉత్తర భారత దేశంలోనూ కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యిందన్న రిపోర్ట్ లు వస్తున్నాయని కలెక్టర్ చెప్పారు.
ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్తతో అందరమూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.కరోనాను నివారించేందుకు తప్పనిసరిగా మాస్క్ సోషల్ డిస్టన్స్,, చేతులను సబ్బుతో గానీ, శానిటైజర్తో గానీ తరచూ శుభ్రం చేసుకోవాలని కలెక్టర్ మరోమారు జిల్లా ప్రజలకు తెలియచెప్పారు.
కరోనా నియంత్రణకు ప్రభుత్వం సూచించిన 15 నియమాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ అన్నారు.
జిల్లాలో ప్రస్తుతం కేసుల సంఖ్య-121
మిమ్స్ ఆసుపత్రిలో- 13
జిల్లా కేంద్రాసుపత్రిలో- 30
పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో- 02
హోం అయిసోలేషన్లో- 76
ఇప్పటి వరకు చేసిన కోవిడ్ టెస్టులు నమోదైన కేసులు
మార్చి 06 0
ఏప్రెల్ 4416 0
మే 18856 31
జూన్ 20010 260
జులై 43350 5327
ఆగస్టు 90086 16428
సెప్టెంబరు 133726 14475
అక్టోబరు 136618 3948
నవంబరు 110012 1324
డిసెంబరు-7 వరకు 21033 100
మొత్తం 5,78,113 40,893