ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి తో కలిసి మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు ఒక
మొక్కను నాటి దాని సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి విద్యాచందన, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రమణి, కార్యాలయపు సిబ్బంది తదితరులు ఉన్నారు