40.2 C
Hyderabad
April 29, 2024 18: 01 PM
Slider ఖమ్మం

సింగరేణితో అభివృద్ధి

#VP Gautham Satthupalli

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సావాల్లో భాగంగా సింగరేణి కాలరీస్‌లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్యతో కలిసి జ్యోతిప్రజ్వలన గావించి ఉత్సవాలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో అత్యధికంగా వనరులు చేకూర్చే సింగరేణి ప్రాంతానికి మంచి జరిగిందన్నారు. ఈ ప్రాంతానికే కాదు రాష్ట్రానికి, దేశానికి కూడా చాలా మంచి జరిగిందన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఖమ్మంలో ఉన్న ఏకైక ఇండస్ట్రీ సింగరేణి ఇండస్ట్రీ అని అన్నారు. అతిపెద్ద సింగరేణి మైనింగ్‌ ఇండస్ట్రీ మన

ప్రాంతంలో ఉండటం అదృష్టం అన్నారు. స్థానిక శాసనసభ్యులు సింగరేణి ప్రభావిత ప్రాంతాల గురించి, చిన్న చిన్న సమస్యల గురించి ఎప్పుడూ నా దృష్టికి తీసుకుని వస్తుంటారు అని తెలిపారు. డిస్టిక్‌ మినరల్‌ ఫండ్‌ నుంచి 455 పనులు 183 కోట్లుతో మంజూరు చేయడమే కాకుండా పూర్తిచేయడం కూడా జరిగిందన్నారు. ఇదే కాకుండా సిఎస్‌ఆర్‌ నిధుల

నుంచి 33 కోట్లు అభివృద్ధికి ఉపయోగించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణి వచ్చే ఆదాయాన్ని సింగరేణి ఇండస్ట్రీ ఉన్న ప్రాంతంలోని ప్రజల అభివృద్ధికి ఉపయోగించడం జరగాలని తెలిపిందన్నారు. ఈ ఇండస్ట్రీ వల్ల నివాసులకు కొంత ఇబ్బందుల ఎదురవుతున్నాయని స్థానిక శాసన సభ్యులు మా దృష్టికి తీసుకురావడం

జరిగిందన్నారు. దీనిపైన త్రీ మ్యాన్‌ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో సింగరేణి సంస్థ సత్తుపల్లి ప్రాంతం నుంచి కొత్తగూడెం ప్రాంతం వరకు నూతనంగా రైలు మార్గం ఏర్పాటు చేసి బొగ్గు రవాణాకు ప్రత్యేకంగా ఒక రైలును ఏర్పాటు చేసిందన్నారు. ఈ రైలు మార్గం వలన భవిష్యత్తులో సత్తుపల్లి టు

కొత్తగూడెం ప్యాసింజర్‌ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలోని కొత్తగూడెం (భద్రాచలం) రైలు మార్గం కూడా అలాగే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అన్నారు. సింగరేణి ఇండస్ట్రీ వలన ఉపాధి అవకాశాలు పెంపొందాయి అన్నారు. కొత్తగూడెంలోని కేటీపీఎస్‌, ఐటిసి, నవభారత్‌, బిటిపిఎస్‌ ఇండస్ట్రీలు రావడానికి సింగరేణి

ప్రధాన కారణమన్నారు. విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు ప్రధాన కారణం అని, ఆ బొగ్గు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లభ్యం అవ్వడం మనందరి అదృష్టమన్నారు. దీనివలన విద్యుత్‌ ఉత్పత్తికి ఎటువంటి డోకా లేదన్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరాకు మన ప్రాంతంలో లభించే బొగ్గే ప్రధాన కారణమన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న

సింగరేణి యాజమాన్యానికి ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.సింగరేణి ఉత్సవాల సంబరాల్లో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తు కలిగిన సింగరేణి సంస్థను కాపాడుకోవడంలో మనమందరం భాగస్వామ్యం కావాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి పారిశ్రామిక

అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. సింగరేణి అభివృద్ధి మన ప్రాంత అభివృద్ధి దేయంగా పనిచేసింది అన్నారు. సింగరేణి ఎండి శేఖర్‌ ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గనులను వెలికి తీసేలా ఒరిస్సా వైపు అడుగులు వేయడం జరిగిందన్నారు. ఈరోజు సింగరేణి మన ప్రాంతంలో ఉండబట్టే మన ప్రాంత అభివృద్ధికై రిజర్వేషన్లు సిఎస్‌ఆర్‌, ఎమ్డిఎఫ్‌

ఫండ్స్‌ వస్తున్నాయన్నారు. సత్తుపల్లి అభివృద్ధికి 100 కోట్ల నిధులను సింగరేణి అందించడం మామూలు విషయం కాదన్నారు. 2 ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టే మనకి ఆదాయం సమకూరుతుందన్నారు. సింగరేణి ఇండస్ట్రీ వలన పర్యావరణానికి హాని, బ్లాస్టింగ్‌, ప్రజలకు ఇబ్బందులు వంటి అంశాలు ఉన్నా కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం

సత్తుపల్లి ప్రజానికం అనుకూల దృక్పథంతో ఉందన్నారు. గత నాలుగు నెలల కాలంలో సింగరేణి నుంచి 250 కోట్లు నిధులు సత్తుపల్లి అభివృద్ధికి కేటాయించడం జరిగిందన్నారు. 1200 మెగావాట్ల ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ మన ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అతి త్వరలో 1600 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ కూడా ఏర్పాటు

చేయడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థ వల్ల మనందరికీ వెలుగు జిలుగుల నిరంతర విద్యుత్‌ సరఫరా అందుతుందన్నారు. సింగరేణి సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు నుంచి ఉన్నతాధికారి వరకు అందించే సేవలు అమోఘం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సిబ్బందికి ఇంక్రిమెంట్లు, బోనస్‌, సెలవులు, కారుణ్య

నియామకాలు వంటి సేవలను అందిస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్ర ప్రముఖమైందన్నారు.
ఈ సమావేశంలో సింగరేణి జిఎం కె.రమేష్‌ మాట్లాడుతూ సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. 9 సంవత్సరాల కాలంలో సింగరేణి పనితీరు మెరుగ్గా ఉందన్నారు. 2013/14 సంవత్సరంలో 50

మిలియన్‌ టన్నుల ప్రొడక్షన్‌ ఉన్న సింగరేణి ప్రస్తుతం 67 మిలియన్‌ టన్నుల ప్రొడక్షన్స్‌ స్థాయికి చేరుకుందన్నారు. మరో ఐదేళ్లలో 100 మిలియన్‌ టన్నుల ప్రొడక్షన్‌ సాధిస్తామన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సిఎస్‌ఆర్‌, డిఎంఎఫ్‌ ఫండ్స్‌

కూడా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహిస్తే ప్రజలకే మేలు జరుగుతుందన్నారు. గతంలో 18 శాతం బోనస్‌ గా ఉండే సింగరేణి కార్మికుల బోనస్‌ శాతం 2022 వ సంవత్సరంలో రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు 30 శాతానికి పెంచారన్నారు. దీపావళి బోనస్‌ గతంలో 48 వేల రూపాయలు ఉంటే ప్రస్తుతం 76,500 రూపాయలు బోనస్‌ గా

ఇస్తున్నామన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, కోవిడ్‌ సమయంలో అందించిన వైద్య సేవలు వంటివి సింగరేణి సామాజిక సేవకు తార్కానమన్నారు. సింగరేణి అభివృద్ధిలో భాగస్వామ్‌ అయిన ప్రతి ఒక్కరికి ఆయన ఈ సందర్భంగా దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

సమగ్ర శిక్షా పథకం కొనసాగింపునకు కేబినెట్ కమిటీ ఆమోదముద్ర

Satyam NEWS

అమెరికా ప్రభుత్వ యంగ్ పొయెట్  రాయబారిగా సూర్యాపేట జిల్లా వాసి

Satyam NEWS

సీఎంకు సిపిఐ లేఖ

Sub Editor

Leave a Comment