తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూన్నూరు కాపులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జర్నలిస్టుల ఫోరం నూతన సంవత్సరం 2023 డైరీని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కొండా దేవయ్య మాట్లాడుతూ మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉండి హక్కుల సాధనకు కృషి చేయాలని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు కీలకపాత్ర పోషించి ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులు జిల్లా,మండల కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ నగరంలో త్వరలోనే మున్నూరు కాపుల మహా గర్జన ఏర్పాటు చేస్తున్నట్లు దేవయ్య తెలిపారు.ఈ మహా గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్, మున్నూరు కాపు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జల్లేపల్లి వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కోలా నాగేశ్వరరావు,గోపినాథ్,కాల్వ వెంకటేశ్వరావు,వెంకన్న,శ్రీనివాసులు, రాము,వేణు,గోపినాథ్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్