విశాఖపట్నానికి చెందిన మాజీ కార్పొరేటర్ పీలా ఉమారాణి భర్త శ్రీనివాస్ దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగిన ఆయన ఈ తెల్లవారు జామున నాలుగో నంబర్ ప్లాట్ ఫాం మీదనున్న బెంచి మీద పడిపోయారు.
ఆర్పీఎఫ్ సిబ్బంది వచ్చి చూసేసరికి ఆయన అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. ఆస్తుల తగాదా నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎవరూ తన మాట వినడం లేదని, అందుకే మనస్థాపం చెంది చనిపోతున్నానని సూసైడ్ లేఖ కూడా రాశారు. పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు