తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సోమవారం(17వ తేదీ) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1682 కరోనా పాజిటివ్ కేసులు.. ఎనిమిది మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 235, రంగారెడ్డి జిల్లాలో 166 కేసులు నమోదయ్యాయి.
దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 93,937కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 72,202 మంది కోలుకోగా.. 21,024 మంది చికిత్స తీసుకుంటున్నారు.
వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 711మంది ప్రాణాలు విడిచారు. నిన్న ఒక్కరోజు 19,579 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.