బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని తెరాస పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాగృతి జిల్లా కో కన్వీనర్ ఎన్ఎం బాల్రాజ్, ఎంపిపి అశోక్ పటేల్ లు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికి మిఠాయిలు పంచిపెట్టారు. కవిత మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, సొసైటీ చైర్మన్ బాలాజీ, మాజీ జడ్పిటిసి సాయిరాం, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, తెరాస పట్టణ అధ్యక్షులు బొమ్మల లక్ష్మణ్, సీనియర్ నాయకులు పాషా సెట్, మాజీ ఎంపిటిసి దర్పల్లి సాయన్న, సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు జాగృతి నాయకులు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post