రాజకీయ చదరంగంలో….
వివాదరహితుడై.. స్థితప్రజ్ఞుడై…
భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన దక్షిణాధ్యుడు మన తెలుగువాడు
పాములపర్తి వెంకట నరసింహారావుగారు…
మైనారిటీ ప్రభుత్వ రథసారథియై
నిండు ఐదేళ్లు అధికారంలో కొనసాగించిన
తెలుగు జాతి అనర్ఘరత్నం….
భారత విదేశాంగవిధాన
దార్శనికుడు….
ఆర్థిక సంస్కరణల పితామహుడు….
సహజ తెలివితేటలతో తీవ్రవాద
దౌత్య సంబంధాలను నెరిపిన రాజనీతిజ్ఞుడు…..
రాజకీయాల్లో తీరికలేకుండా
గడిపినా…..
సాహిత్యరంగంలో
కొత్తపుంతలు తొక్కి
సృజనాత్మకతకు
మారుపేరుగా నిలిచిన…
నిరాడంబర
బహుభాషా కోవిదుడు…
భారత దేశపు
కీర్తి బావుటాను
ప్రపంచ పటంలో
సమున్నత స్థానానికి
తీసుకువెళ్లిన
“ఆధునిక చాణక్యుడు”
పీవీ నరసింహారావు గారి
శతజయంతి సందర్భంగా
అక్షర కుసుమాలతో నీరాజనాలు….
నలిగల రాధిక రత్న, PH:8639635538