మాజీ రెవెన్యూ శాఖ మంత్రి కమతం రాంరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కమతం శనివారం ఉదయం తన స్వగ్రామం అయిన గండీడ్ మండలం మహమ్మదాబాద్ గ్రామంలో తుదిశ్వాస విడిచారు.
కమతం రామిరెడ్డి మరణం పట్ల సీఎం కేసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్నఅనుబంధాన్నిగుర్తు చేసుకున్నారు. కమతం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాం రెడ్డి మరణించడం బాధాకరమని రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. ఆయన మరణం బాధాకరమని అన్నారు. కమలం రాంరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.