ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ భత్యాల చెంగల రాయుడు మద్దతు తెలిపారు. మంగళవారం రాజధాని రైతులకు మద్దతుగా మందడం వెళ్లి రైతులు చేస్తున్న 70వ రోజు దీక్షలో ఆయన పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ ,లీగల్ సెల్ డి.వెంకటేశ్వరావ్ తదితరులు పాల్గొన్నారు.
previous post