కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా చేపట్టే సహాయక చర్యల కోసం నిర్మల్ మాజీ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలెక్టర్ సహాయ నిధికి 5 లక్షలు విరాళంగా అందజేశారు.
ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ కి చెక్కును అందజేశారు. కరోనా వెైరసు నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంఘీభావంగా విరాళాలు ఇచ్చిన మాజీ శాసనసభ్యుడికి జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.