వనపర్తి పట్టణంలో సారా తయారీకి సంబంధించిన నల్లబెల్లం సీజ్ చేశామని వనపర్తి ఆబ్కారీ సిఐ సుభాష్ చందర్ రావు విలేకరులకు తెలిపారు. రవాణాలో ఉపయోగించిన ఆటోను కూడా సీజ్ చేశామని చెప్పారు. ఈ కేసులో 60 కేజీల నల్లబెల్లం ను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. గోపాల్ పేట గ్రామానికి చెందిన పుల్లయ్య, వెంకటేశంపై కేసు నమోదు చేశామని తెలిపారు. సారా తయారీకి బెల్లం అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నాటు సారా, బెల్లం, గంజాయికి సంబంధించిన సమాచారం 9440902625 నెంబర్ కు తెలిపాలని ఆయన ప్రజలను కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా పెడతామని చెప్పారు. ఈ దాడులలో ఎస్ఐ సునీత, కానిస్టేబుల్స్ చంద్రశేఖర్, రాజు, కురుమూర్తి, మన్యం, ఆంజనేయులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్