కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని కోడేర్ మండల తాండలలో దాడులు నిర్వహించినట్టు కొల్లాపూర్ ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు తెలిపారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.
పెద్ద ఎత్తున అక్రమ సారాను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో మహబూబ్ నగర్ ఎన్ ఫోర్సుమెంటు అధికారులు, డిటిఎఫ్ నాగర్ కర్నూల్ అధికారులు కూడా పాల్గొన్నారు.
కోడేర్ మండలంలోని గుండ్యా వల్ నాయక్ తాండా, నాగులపల్లి తాండాలలో ఈ దాడులు జరిగాయి. మొత్తం ఆరు కేసులు బుక్ చేసి 20 లీటర్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 700 లీటర్ల వాష్ ధ్వంసం చేశారు.