కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదడిగి గ్రామంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గంగాసాగర్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కలలను సాకారం చేద్దామన్నారు. ఆయన తనయుడు రాహుల్ ను ప్రధాని చేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యంగా పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ సర్పంచ్ పిరాజీ, నాయకులు సాయిలు, బీర్గొoడా, శివరామ్ ,హనుమాన్లు, సంతోష్ ,అశోక్ ఉన్నారు.