అన్నమయ్య జిల్లా రాజంపేట నందలూరు మండల జనసైనికుల ఆధ్వర్యం లో పత్రికా విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జనసేన పార్టి రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతవారం రోజులుగా కొత్త మంత్రి పదవులు తీసుకున్న మంత్రులు పరిపాలన పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ని తిట్టడమే పరిపాలన గా పెట్టుకున్నా రన్నారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని అన్నారు.
అలాగే నియోజకవర్గ సమస్యలు తీసుకుంటే మండలం లోని ఆల్విన్ కర్మాగారం అలాగే రైల్వే లోకోషేడ్ వాటి స్థానం లో యువతకి ఉపాది కలిగించే విధంగా చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారని, ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. గత ఏడాది చివరిలో అన్నమయ్య ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిపోవడం వలన తోగురుపేట,మందపల్లి, పులపత్తూరు ఇంకా చిన్న పాటి గ్రామాలు ప్రజలు చాల ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. దీనికి సంబందించి స్వయాన ముఖ్యమంత్రి వచ్చి సందర్శించారని,వారు ఇచ్చిన హామీలు ఇంత వరకు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని ఆరోపించారు.
ఇలా నియోజకవర్గ స్థాయి సమస్యల గురించే పటించుకోడం లేదని అన్నారు. కొత్తగా వచ్చిన మంత్రులు వారి శాఖల పనితీరు మరియు వారి శాఖల గురించి సరిగా అవగాహన లేదు కానీ,వారు పదవులు పొందినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగత విమర్శలు చేయడమే సరిపొయిందని ఆరోపించారు. ఇక మీదట ఐనా వ్యక్తిగత విమర్శలు మానాలని, లేని పక్షంలో తాము వ్యక్తి గతంగానే సమాధానం చెప్తామని అన్నారు.
పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో చనిపోయిన కౌలు రైతులకు 30 కోట్లతో మూడు వేల మందికి ఒక లక్ష చొప్పున చనిపోయిన కౌవులు రైతులకు ఆర్థిక సహాయం చేస్తూ ప్రజల్లో పార్టీ బలపడం చూసి ఓర్చుకోలేకుండా పవన్ కళ్యాణ్ ని విమర్శలు చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగానే పెళ్లి చేసుకున్నారని , అక్రమాస్తులు కూడబెట్టి అవినీతి చేసి జైలుకు వెళ్లలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టంగుటూరు ఈశ్వరయ్య, కళ్యాణ్, సుబ్బయ్య, తిప్పాయపల్లి ప్రశాంత్, మంకు వెంకటేష్, జయరామ్, ఆవుల సాయి ,ప్రకాష్, ఎద్దల నరసింహ, ఉపేంద్ర ,గురివిగారి వాసు, తదితరులు పాల్గొన్నారు.